YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

25 శాతమే అభివృద్ధి చేశాం: సిరిసిల్లలో కేటీఆర్

 25 శాతమే అభివృద్ధి చేశాం: సిరిసిల్లలో కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో సిరిసిల్లలో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సొంత నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు సిరిసిల్ల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు కేటీఆర్. అనంతరం సిరిసిల్ల ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. మీకోసం ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయినా... ప్రతీ సోదరుడు, ప్రతీ సోదరి, టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. నా విజయంలో పాత్ర పోషించిన ప్రతీ ఒక్కరికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. అభివృద్ధి, సంక్షేమంలో సిరిసిల్లను ముందుకు తీసుకెళ్లాలని మరోసారి నన్ను ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తాం. 
ఎన్నికల్లో 88 స్థానాలను కట్టబెట్టి టీఆర్ఎస్‌పై నమ్మకాన్ని రెట్టింపు చేశారు. సిరిసిల్లనే నాకు రాజకీయ గుర్తింపు ఇచ్చింది. సిరిసిల్లలో ఇప్పటివరకూ చారాణా (25 శాతం). ఇంకా చేయాల్సింది బారణా (75 శాతం) ఉంది. విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నాం. తాగునీటి సమస్యను 95 శాతం పరిష్కరించాం. వచ్చే 6 నెలల్లో నియోజకవర్గంలో అన్ని మండలాలకు సాగునీరు అందించి అభివృద్ధిలో ముందుకు సాగుతామని’ సిరిసిల్లలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

Related Posts