YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

సినీ నటుడు ప్రభాస్ వాజ్యం ధర్మాసనానికి బదిలీ

 సినీ నటుడు ప్రభాస్ వాజ్యం ధర్మాసనానికి బదిలీ
తన అతిథి గృహాన్ని సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనానికి హైకోర్టు బదిలీ చేసింది.  హైదరాబాద్ రాయదుర్గంలోని తన అతిథి గృహాన్ని అధికారులు నిన్న సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాయదుర్గంలోని ‘పైగా’ భూములపై కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. ఆ భూములు ప్రభుత్వానివేనని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో అక్కడి కట్టడాలను ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్కడే ఉన్న ప్రభాస్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. అధికారులు దాన్ని సీజ్ చేశారు. అయితే అధికారుల చర్యలను సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ విచారణ చేపట్టారు. నిబంధనలను పాటించకుండా.. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సీజ్ చేయడం చట్ట విరుద్ధమని ప్రభాస్ తరఫు న్యాయవాది వాదించారు. అధికారుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.  అయితే ఈ వివాదం చాలా మందికి సంబంధించింది గనక ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పిటిషన్పై ధర్మాసనం గురువారం విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ శివారు ప్రాంతం రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సినీహీరో ప్రభాస్ గెస్ట్హౌస్ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ అతిథిగృహం వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు.

Related Posts