సిద్దిపేట రూరల్ మండలం హరీష్ రావు దత్తత గ్రామం, ఆదర్శ గ్రామమైన ఇబ్రహీం పూర్ గ్రామాన్ని 15 రాష్ట్రాల కు చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మేల్సీలు మరియు 25 మంది ఐఏఎస్ లు గురువారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇబ్రహీం పూర్ ప్రజలు చాలా అదృష్టవంతులు. మన దగ్గర చేసిన మంచి పనులను నేర్చుకోవడానికి వచ్చారు. ఇది ఇబ్రహీం పూర్ ప్రజల గొప్పతనమని కొనియాడారు. ఇది స్పూర్తిదాయకం, ఇంకా చాలా చేయాలి. - భవిష్యత్తులో ఇంకా కలిసి మెలిసి ఉంటూ గ్రామాన్ని ఆదర్శంగా మార్చుకోవాలని అన్నారు. తన పర్యటన సందర్బంగడా అయన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ అన్నింటిలో ఆదర్శం ఇబ్రహీం పూర్. ఓట్లు వేయడం లో కూడా ఆదర్శంగా ఉన్నారు. 97.6 శాతం ఓట్లు వేసి జిల్లా లో మొదటి స్థానంలో ఉంచారు. పోలైన ఓట్లలో అత్యధిక శాతం టీఆర్ఎస్ వేసిన మొదటి గ్రామం కూడా ఇబ్రహీం పూరే. నా ఊపిరి ఉన్నంత వరకు నా గుండెల్లో పెట్టుకుంటా. నాకంటే ఐశ్వర్యవంతులు ఎవరూ ఉండరని అన్నారు. ప్రేమ అభిమానం మించిన ఐశ్వర్యం మరోటి లేదు. ఎన్ని కోట్లు ఉన్నా ప్రేమ అభిమానం కొనలేము. మీకు మరింత సేవ చేస్తా. మీకోసం సంచులు తీసుకొచ్చాం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు రాకుండా ఈ జనపనార సంచులే వాడాలని సూచించారు.