YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

2019-20కు జిహెచ్ఎంసి ముసాయిదా బ‌డ్జెట్ మొత్తం రూ. 6150 కోట్లు

2019-20కు జిహెచ్ఎంసి ముసాయిదా బ‌డ్జెట్ మొత్తం రూ. 6150 కోట్లు
జీహెచ్ఎంసీ 2019-20 ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్ ముసాయిదాను నేడు జ‌రిగిన స్టాండింగ్ క‌మిటిలో ప్ర‌వేశ‌పెట్టారు. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స్టాండింగ్ కమిటి స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్‌, స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. 2019-20 సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ‌పెట్టిన‌ బ‌డ్జెట్ ప్రతిపాద‌న‌ల‌పై  వ‌చ్చే స్టాండింగ్ క‌మిటిలో పూర్తిస్థాయి చ‌ర్చ నిర్వ‌హించి జ‌న‌వ‌రి 10వ తేదీలోపు జ‌న‌ర‌ల్ బాడి స‌మావేశంలో చ‌ర్చించి తుది బ‌డ్జెట్‌ తీర్మానాన్ని ప్ర‌భుత్వ ఆమోదం కోసం ఫిబ్ర‌వ‌రి 20వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంద‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ స్టాండింగ్ క‌మిటికి తెలియజేశారు. ఈ బ‌డ్జెట్ ముసాయిదా పై అద్య‌య‌నం చేసిన పిద‌ప వ‌చ్చే స్టాండింగ్ క‌మిటీలో చ‌ర్చించడానికి అనుమ‌తి కోరుతూ స్టాండింగ్ క‌మిటి స‌భ్యులు ప్ర‌తిపాదించ‌డంతో మేయ‌ర్ బొంతు రామ్మోహన్ ఇందుకు అంగీక‌రించారు. 2019-20 బ‌డ్జెట్ ముసాయిదా వివ‌రాలు...
2018-19 ఆమోదిత బ‌డ్జెట్ రూ. 6076.86 కోట్లు
2018-19 స‌వ‌రించిన బ‌డ్జెట్ మొత్తం రూ. 5375 కోట్లు
2019-20కు ప్ర‌తిపాదిత ముసాయిదా బ‌డ్జెట్ మొత్తం రూ. 6150 కోట్లు
మేజ‌ర్ ప్రాజెక్ట్‌ల‌కు ప్‌సతిపాదిత బ‌డ్జెట్ మొత్తం రూ. 5388 కోట్లు
2019-20 ప్ర‌తిపాదిత మొత్తం బ‌డ్జెట్ ముసాయిదా రూ. 11538 కోట్లు

Related Posts