ఎన్నికల కమిషన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ కేసీఆర్తో కుమ్మక్కైందని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పరోక్షంగా టీఆర్ఎస్ కు సహకరించారని విమర్శించారు. ఆందోల్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో దామోదర రాజనర్సింహ ఈ వ్యాఖ్యలు చేశారు. 22 లక్షల మంది కొత్త ఓటర్లను మోసం చేశారని ధ్వజమెత్తారు. పాత ఓటర్ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించారని వ్యాఖ్యానించారు. రైతులకు, పథకాలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని రాజనర్సింహ చెప్పుకొచ్చారు.