హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలకు చెందిన ప్రజల నుండి ఫిర్యాదులు, ఇంకా ఇబ్బందులను పరిశీలించేందుకు ఒకటో ‘డాక్ అదాలత్’ ను ఈ నెల 27వ తేదీ నాడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఆబిడ్స్ లో గల డాక్ సదన్ లో నిర్వహించనున్నట్లు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ రీజియన్ కు చెందిన పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం తెలిపింది. ఇందుకోసం ప్రజలు తమ ఫిర్యాదులను, ఇబ్బందులను ఒకటో డాక్ అదాలత్ కె. వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ - II, పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం, హెడ్ క్వార్టర్ రీజియన్, హైదరాబాద్ - 500 001 అనే చిరునామా తో పోస్టల్ ఎన్వలప్ ద్వారా ఈ నెల 24వ తేదీ నాడు లేదా ఆ లోపలే పంపాలని ప్రకటనలో వివరించారు.