YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీ కాంగ్రెస్ కు అసెంబ్లీలోనూ దక్కని ప్రతిపక్ష హోదా

టీ కాంగ్రెస్ కు అసెంబ్లీలోనూ దక్కని ప్రతిపక్ష హోదా
తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. నిబంధనల ప్రకారం సభలోని మొత్తం సభ్యుల్లో 10 శాతం మంది ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు ఉంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇద్దరే. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దయింది. దీంతో ఇప్పటి వరకు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న షబ్బీర్ అలీ ఆ హోదా కోల్పోనున్నారు. మండలిలో మాదిరిగా అసెంబ్లీలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. అయితే.. వీరిలో 12 మంది గులాబీ తీర్థం పుచ్చుకోడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. 12 మంది కాకపోయినా.. కనీసం 8 మంది టీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్ కొంపకొల్లేరే. అసెంబ్లీలోనూ మండలి సీనే రిపీట్ అవుతుంది. అప్పుడు కాంగ్రెస్‌కు చావు దెబ్బే. తాజాగా ఆ పార్టీకి శాసనమండలిలో ప్రతిపక్ష హోదా రద్దయింది. దీనికి సంబంధించిన గెజిట్‌ను మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు విడుదల చేశారు. కాంగ్రెస్‌ఎల్పీ.. టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం కావడంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రద్దయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కాంగ్రెస్ కోలుకోకముందే.. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్, ప్రభాకర్, దామోదర్ రెడ్డి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నలుగురూ కలసి శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం ని టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేయాల్సిందిగా చైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ ఇచ్చారు. ఎమ్మెల్సీలు లేఖ ఇచ్చిన కొద్ది గంటల్లోనే దాన్ని ఆమోదిస్తూ నోటిఫికేషన్ వచ్చేసింది. వారిని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు ఎమ్మెల్సీలు వెళ్లిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీకి శాసనమండలిలో ఇద్దరే  సభ్యులుగా మిగిలారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా రద్దయింది. 

Related Posts