YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అల్లు అరవింద్, దిల్ రాజు ను షూట్ చేయాలి..!!

అల్లు అరవింద్, దిల్ రాజు ను షూట్ చేయాలి..!!

రజనీకాంత్ తాజా చిత్రం 'పెటా'ను తెలుగులో విడుదల చేస్తున్న వల్లభనేని అశోక్, 10వ తేదీన చిత్ర రిలీజ్ ను ప్లాన్ చేసుకోగా, ఆయనకు థియేటర్ల కొరత ఏర్పడింది. ఈ సంక్రాంతికి బాలకృష్ణ 'ఎన్టీఆర్ - కథానాయకుడు',   రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లు విడుదలవుతుండటంతో 80 శాతానికి పైగా థియేటర్లలో ఈ రెండు సినిమాలే ఆడనున్నాయి. ఆపై వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్-2' రానుంది. ఇదే సమయంలో అజిత్ 'విశ్వాసం' కూడా రానుంది. దీంతో 'పెటా'కు థియేటర్లే లభించడం లేదు. రెండు మూడు థియేటర్లు ఉన్న సీ-సెంటర్లలో పెటా విడుదలకే నోచుకోని పరిస్థితి. 10 నుంచి 15 వరకూ థియేటర్లు ఉన్న పట్టణాల్లో కనీసం ఒక థియేటర్ అయినా దక్కుతుందో లేదోనన్న ఆందోళనలో వల్లభనేని అశోక్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నయీమ్ వంటి గ్యాంగ్ స్టర్ ను ఎన్ కౌంటర్ చేసి చంపిన తెలంగాణ ప్రభుత్వం, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి థియేటర్ మాఫియాను కూడా షూట్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

Related Posts