YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

సూది లేకుండా, నొప్పిలేకుండా విద్యార్ధులలో రక్తహీనత గుర్తింపు

 సూది లేకుండా, నొప్పిలేకుండా విద్యార్ధులలో రక్తహీనత గుర్తింపు
రాష్ట్రియ బాల స్వాస్ధ్య కార్యక్రమము లో భాగమైన ముఖ్యమంత్రి బాల సురక్ష కార్యక్రమము క్రింద 0-18 సంవత్సరముల వయస్సు గల విద్యార్ధులో రక్తహీనత ను గుర్తించుటానికి కొత్తగా  ప్రవేశపెట్టిన పరికరాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ముఖ్యమంత్రి బాల సురక్ష బృందాలకు అందచేశారు. సాధారణంగా సూది ద్వారా రక్త సేకరణ చేసి హెచ్ బి ని గుర్తిస్తారు. కానీ ఈ పరికరమును ఉపయోగించడం ద్వారా సూది తో  రక్తాన్ని తీసే అవసరం లేకుండా కేవలం  కంటి లోని కంజెక్టీవను ఫోటో తీసి మొబైల్ లేదా ట్యాబు లో ప్రత్యేకమైన యాప్ ద్వారా పిల్లలలో రక్తహీనత ను  గుర్తించవచ్చు. ఈ కార్యక్రమములో కలెక్టర్  మాట్లాడుతూ విద్యార్ధులకు ప్రాథమిక దశ లోనే రక్తహీనతను గుర్తించడం ద్వారా విద్యార్ధుల ఆరోగ్నాన్ని కాపాడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమములో మునిసిపల్ కమీషనర్  ప్రశాంతి,  సమన్వయకర్త ఆర్.బి.ఎస్.కె. హెమలత,  ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Related Posts