YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉద్వేగానికి గురైన కేసీఆర్

ఉద్వేగానికి గురైన కేసీఆర్

పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ రెండో స్పీకర్‌గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత సభా నాయకుడి హోదాలో కేసీఆర్ ప్రసంగించారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలనే ఉద్దేశంలతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో చర్చలు జరిపామని.. ఇందుకు వారంతా సహకరించారని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం స్పీకర్‌ స్థానంలో ఎంపికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరి.. ఆపై జరిగిన ఉప ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారని పోచారాన్ని కొనియాడిన కేసీఆర్.. రాష్ట్రావతరణ అనంతరం ఏర్పడిన తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మిమ్మల్ని.. రెండో విడత మంత్రిమండలిలో మిస్ అవుతున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. సభ కూడా కుటుంబం లాంటిదని దీన్ని విజయవంతంగా ముందుకు నడిపించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, పంచాయతీరాజ్, గనులు, వ్యవసాయశాఖ మంత్రిగా సేవలందించారని కేేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ తొలి వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం వచ్చిన శుభవేళ రాష్ట్రంలోని రైతాంగానికి ఎన్నో కార్యక్రమాలు అమలయ్యాయని.. అందుకే అందుకే పోచారం శ్రీనివాస్ రెడ్డిని లక్ష్మీపుత్రడని మేము పిలుచుకుంటున్నామని కేసీఆర్ కొనియాడారు.రైతుబంధు పథకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మంచి గుర్తింపు తెచ్చుకుందని.. దీనికి కారణం శ్రీనివాస్ రెడ్డి గారేనని కేసీఆర్ కితాబిచ్చారు. పోచారం వ్యవసాయ యాంత్రీకరణ, అధునాతన వ్యవసాయ పద్దతులు ప్రవేశపెట్టారని కొనియాడారు. శ్రీనివాస్ రెడ్డి ఇంటి పేరు పరిగి.. కానీ పోచారం గ్రామాన్ని ఇంటిపేరుగా మార్చుకున్నారని సీఎం అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థిగా ఉన్న పోచారంను పోలీసులు నిర్బంధించారని.. దీనివల్ల ఆయన కెరీర్ నష్టపోయారని.. 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న పోచారం కుటుంబం.. నిజాంసాగర్‌ నిర్మాణం సమయంలో భూమిని కోల్పోయిందని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో గొప్ప సేవలు అందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగ అత్యున్నత స్థానంలో బాధ్యతలు స్వీకరించడం పట్ల పోచారం గ్రామస్థులు సంబురాలు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.

Related Posts