YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిరంజన్ రెడ్డి

 వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిరంజన్ రెడ్డి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:    

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రిగా  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం సచివాలయంలో తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నాటి సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయిపోయి అప్పుల పాలైనరు రైతులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అనివార్యంగా రైతులు బోరు బావులపై ఆధారపడి ఉన్న పరిస్థితి ఉంది. కరెంట్ బిల్లులు అమలు కంటే  ఇంకా పెంచుతూ పోయారు గత పాలకులు కానీ నాణ్యమైన విద్యుత్ ను అందించలేదు . స్వరాష్ట్ర సాధన లోనే డిప్యూటీ స్పీకర్ ఉంటూ లేఖను సంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంతిమంగా 14 సంవత్సరాల పోరాటం తరువాత తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం ను సాధించిన విషయం తెలిసిందేనని అన్నారు. రైతుల పై దూర దృష్టి తో ప్రాజెక్టులను నిర్మించిన సీఎం కేసీఆర్ రైతులను రాజులుగా చూడడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అప్పట్లో గోదావరి నది పై ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టలేదు కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. వ్యవసాయ రంగం కు నీరు అందించటంతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం. రైతు బంధు దేశంలోనే గొప్ప పథకం రైతు బంధు తో రైతులు ఆత్మగౌరవం తో బతుకుతున్నారు
ఉద్యయం నుండి ఇప్పటివరకు కేసీఆర్ అడుగులో అడుగువేస్తూ ముందుకు సాగడం జరిగింది
నాపై గురుతరమైన బాధ్యతను ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలని అన్నారు. నాకు వ్యవసాయ శాఖ కేటాయించినందుకు వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలలో ఉన్న అధికారులను అందరిని కలుపుకొని ముందుకు పోతానని అన్నారు. ఈ సందర్బంగా పలువురు ప్రజా ప్రతినిధులు, సచివాలయా, వ్యవసాయ శాఖ  ఉద్యోగులు మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts