YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

స్వ‌రం మారింది..

Highlights

  • ర‌ణ‌మా..శ‌ర‌ణ‌మా
  • టీడీపీ కంటే దూకుడుగా ఏపీ బీజేపీ నేత‌లు
  • ఆయ‌న దృష్టిలో వెంట్రుక ఎవ‌రో..?
  • బీజేపీకి గుడ్‌బై  టీడీపీకే నష్టం
  • మంత్రి మాణిక్యాల‌రావు
స్వ‌రం మారింది..

ఇంతడితో ఆగితే బాగానే ఉండేది. కొండ‌కి వెంట్రుకేశామంటున్నారు మంత్రి మాణిక్యాల‌రావు. వ‌స్తే కొండ‌..ఊడితే వెంట్రుక అంటున్నారు. అంటే ఆయ‌నుద్దేశం కొండ‌రావ‌డ‌మంటే కేంద్రం క‌ద‌ల‌డం. ఆయ‌న దృష్టిలో వెంట్రుక ఎవ‌రో వేరే చెప్పాలా?

ర‌ణ‌మా..శ‌ర‌ణ‌మా అన్న‌ట్లు అధినాయ‌క‌త్వానికి రెండే ఆప్ష‌న్లు ఇచ్చామ‌న్న‌ది మాణిక్యాల‌రావు చెబుతున్న మాట‌. సాధారణంగా మంత్రి మాణిక్యాల‌రావు సౌమ్యుడని అంటారు . కానీ  అధినాయ‌క‌త్వం ఆదేశిస్తే ఈ క్ష‌ణానే మంత్రి ప‌ద‌వికి రాజీనామాచేస్తాన‌ని చెప్పేశారు. ఏపీ బీజేపీ ప‌దాధికారుల స‌మావేశంలోనూ మంత్రి మాణిక్యాల‌రావు ఆవేశ‌ప‌డ్డారు.ఓ ద‌శ‌లో మాణిక్యాల‌రావుని కంట్రోల్ చేసేందుకు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు గ‌ట్టిగా వారించాల్సి వ‌చ్చింది.

ఇప్పుడేమో బీజేపీకి గుడ్‌బై చెబితే టీడీపీకే ఎక్కువ న‌ష్ట‌మంటున్నారు మాణిక్యాల‌రావు. టీడీపీతో తెగదెంపులు చేసుకోకమునుపే తాము ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశామో చెబుతామని, ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామంటున్నారు. అలా కుదరకుంటే ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లోపే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏపీకి ఇచ్చిన నిధుల గురించి చెప్పిస్తామని మాణిక్యాల‌రావు తెలిపారు.

Related Posts