YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మంచు లక్ష్మీని ఆడుకుంటున్న నెట్ జనులు

మంచు లక్ష్మీని ఆడుకుంటున్న నెట్ జనులు

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

డైలాగ్ కింగ్ మోహన్ బాబు మంగళవారం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రజలకు మంచి చేసే వ్యక్తి. ఆయన సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మూడేళ్ల కిందటే జగన్ తనను పార్టీలోకి ఆహ్వానించారని మోహన్ బాబు తెలిపారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ విషయమై మూడేళ్లుగా చంద్రబాబుకు ఎన్నోసార్లు ఫోన్ చేశానని ఆయన చెప్పారు. మోహన్ బాబుతోపాటు ఆయన కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మి.. జగన్‌ని లోటస్ పాండ్‌లో కలిసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు వైఎస్ఆర్సీపీలో చేరడం పట్ల ఆయన కుమార్తె మంచు లక్ష్మీ స్పందించారు. ‘జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దానికి కామెంట్ చేస్తూ.. ‘అండ్ దిస్ జస్ట్ హ్యాపెండ్.. ఆల్ ది వెరీ నాన్నా’ అని ఆమె ట్వీట్ చేశారు. 
ఆల్ ది వెరీ బెస్ట్ నాన్నా అనే బదులు తొందరపాటు కారణంగా ఆల్ ది వెరీ నాన్న అని లక్ష్మీ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అవును వెర్రీ నాన్నే అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో బెస్ట్ మిస్సయ్యిందని సూచిస్తున్నారు. వెంటనే అలెర్ట్ అయిన ఆమె.. ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. 
జగన్ సీఎం అయితే మంచిది 
వైఎస్ జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని సినీనటుడు మోహన్‌బాబు అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌పై అభిమానంతో టీడీపీలో చేరానని, తర్వాత ఇప్పుడు వైసీపీలో చేరారని తెలిపారు. మంగళవారం మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మి.. వైఎస్ జగన్‌ని లోటస్ పాండ్‌లో కలిసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్‌బాబు.. పదవులు ఆశించి తాను పార్టీలో చేరలేదన్నారు.‘జగన్ ప్రజలకు మంచి చేసే వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది. మూడేళ్ల క్రితమే జగన్ నన్ను పార్టీలోకి ఆహ్వానించాడు. నాకు పదవులపై ఆశలేదు. జగన్‌ సీఎం అయితే చూడాలని ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నేను చేసిన ఆందోళనను చంద్రబాబు వర్గం రాజకీయం చేసింది. మా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయాలని మూడు సంవత్సరాల నుంచి చంద్రబాబుకు ఎన్నోసార్లు ఫోన్ చేశారు. అన్ని వివరాలతో లేఖ రాసి నా కజిన్‌తో పంపించారు. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు’ చంద్రబాబును నేను కావాలని ఏకవచనంతో పిలవలేదు. ఆయనతో ఉన్న బంధుత్వం, స్నేహం కారణంతో అలా పిలిచాను. మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తా అన్నావ్. ఏదీ. ప్రభుత్వం నా ఒక్క కాలేజీకే కాదు.. చాలా విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదు. నేను ధైర్యంగా బయటికి వచ్చాను. చాలామంది తమ బొక్కలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో నోరు మెదపడం లేదు. నాకు రాజకీయాల్లో చేరాలని, పదవులు అనుభవించాలని రాజకీయాల్లోకి రాలేదు. జగన్ ప్రజలకు మంచి చేస్తాడన్న నమ్మకంతోనే ఇప్పుడు వైసీపీలో చేరాను. ఈ పార్టీలో చేరడానికి ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదు. పదవులే కావాలంటే ఎప్పుడో దక్కేవి’ అని మోహన్‌బాబు అన్నారు. 

Related Posts