YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం.. శాంసన్‌ సెంచరీ వృథా..!!

 రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం.. శాంసన్‌ సెంచరీ వృథా..!!

 యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

యువ న్యూస్ కల్చరల్ బ్యూరో: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సూపర్‌ ఆటతీరుతో బోణీ చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 69), బెయిర్‌స్టో అదిరిపోయే ఆరంభాన్నివ్వగా.. విజయ్‌ శంకర్‌ (15 బంతుల్లో 35) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజూ శాంసన్‌ (55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 నాటౌట్‌) అజేయ శతకం సాధించగా, రహానె (49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) వేగం కనబరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రషీద్‌ఖాన్‌ నిలిచాడు.

Related Posts