YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం... హైద్రాబాద్ కు నేతలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం... హైద్రాబాద్ కు నేతలు

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనానికే తెర తీశాడు రామ్‌గోపాల్ వర్మ. హైకోర్టు తీర్పుతో ఏపీలో సినిమాకు బ్రేకులు పడితే.. తెలంగాణలో మాత్రం శుక్రవారం విడుదలయ్యింది. ఏపీలో సినిమా విడుదలకాకపోవడంతో.. కొందరు తెలంగాణకు వచ్చి మరీ సినిమా చూస్తున్నారు. ఆంధ్ర సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాలకు వెళ్లి సినిమా చూసొస్తున్నారు. కొందరు రాజకీయనేతలు కూడా హైదరాబాద్ వచ్చి మరీ సినిమాలు చూశారు. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సినిమా చూడటానికి హైదరాబాద్ వచ్చారు. నగరంలోని థియేటర్‌లో సినిమా చూశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పాటల రచయిత సిరా శ్రీ,.. ఉండవ్లలి, ఎమెస్కో అధినేత విజయకుమార్‌తో కలిసి చూసినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. సినిమా చూస్తూ దిగిన ఫోటోను ట్వీట్ చేశారు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు స్టే విధించింది. దీంతో ఏపీలో మూవీ విడుదల ఆగిపోయింది. తెలంగాణలో మాత్రం శుక్రవారం విడుదలయ్యింది

Related Posts