YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

మల్లికార్జున ఖర్గే ప్రధాని ఆహ్వానాన్ని తిరస్కరించారు

మల్లికార్జున ఖర్గే ప్రధాని ఆహ్వానాన్ని తిరస్కరించారు

'ప్రత్యేక ఆహ్వానితుడు'గా లోక్‌పాల్ ఎంపిక, నియామకంపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకావాలంటూ ప్రధాని మోదీ పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తిరస్కరించారు. ఇందుకు ఆయన ఓ లేఖ ద్వారా కారణాలను ప్రధానికి తెలిపారు. అందులో లోక్‌పాల్ నియామకానికి ఉద్దేశించిన సమావేశానికి తాను హాజరుకాలేనంటూ పేర్కొన్నారు. లోక్‌పాల్ ఎంపిక ప్రక్రియ నుంచి విపక్షాన్ని మినహాయించే ఎత్తుగడ అయినందు వల్ల ఈ సమావేశానికి తాను హాజరుకానని ఆయన తేల్చి చెప్పారు. 

'ప్రత్యేక ఆహ్వానితుడుగా రావాలంటూ పంపిన ఆహ్వానం చూస్తుంటే మొత్తంగా లోక్‌పాల్ ఎంపిక ప్రక్రియ నుంచి విపక్షం స్వేచ్ఛా గొంతుకను మినహాయించడానికి తీసుకున్న ఓ సంఘటిత ప్రయత్నంగా అనిపిస్తోంది' అని ఖర్గే అనుకున్నారు. మరోవైపు మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే సర్కార్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు లోక్‌పాల్ నియామకాన్ని ఎందుకు ఆలస్యం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఖర్గే తన లేఖలో "కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్ చట్టాన్ని ఆమోదించింది. దానిని జనవరి 16, 2014 నుంచి అమలుచేసింది. అవినీతిపై పోరాటం అగదని పదే పదే ప్రకటనలు చేస్తోన్న బీజేపీ ప్రభుత్వం దాదాపు నాలుగేళ్లుగా లోక్‌పాల్‌ను నియమించరాదని భావించింది" అని మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. ఈ సమావేశానికి ప్రధాని సహా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కూడా హాజరవుతారు. 

Related Posts