YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెరాస అభ్యర్ధి మహేందర్ రెడ్డిని గెలిపించాలి

 తెరాస అభ్యర్ధి మహేందర్ రెడ్డిని గెలిపించాలి
రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  బుధవారం చేవెళ్ల, పరిగి, వికారాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్ర నగర్  నియోజకవర్గములో  తెరాస ఎంపిటిసి, జెడ్పిటిసి  సభ్యులతో సమావేశం జరిగింది. ఈ భేటీయి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హజరయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 31 న జరగబోయే రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి గారి విజయానికి మనమందరం కృషి చేయాలని మంత్రి  దిశానిర్దేశం చేసారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి ఎన్నికైన తెరాస ఎంపీపీ, జెడ్పిటిసి, ఎంపిటిసి, కౌన్సిలర్ లు అందరూ పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి భారీ విజయానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి  కాలే యాదయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మెతుకు ఆనంద్, ప్రకాష్ గౌడ్  ఎమ్మెల్సీ లు పట్నం నరేందర్ రెడ్డి,ఎగ్గెం మల్లేశం కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts