ప్రశాంత మైన జీవితం గడపాలి అని ఎస్ ఐ సురేష్ పేర్కొన్నారు. మండల పరిధిలోని గోతుల దొడ్డి గ్రామంలో కార్టన్ అండ్ సర్చ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల ఇంటిలో సోదాలు నిర్వహించారు.వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాబోయే పంచాయితీ ఎన్నికలను దృష్టి లో ఉంచుకొని కౌతలం ఎస్ ఐ సురేష్ పోలీసులు స్థానిక పరిధిలోనే సమస్యాత్మ కంగ ఉన్న గ్రామం గోతుల దొడ్డి అనుమానిత వ్యక్తులు మరియు నేర సంబంధిత ఇండ్లలో సోదాలు నిర్వహించారు. రౌడీ షీటర్ ల ఉన్న వ్యక్తులను పద్దతి మార్చుకోవాలని ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అల్లర్లు గొడవలకు పాల్పడితే వారి పై చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ హెచ్చరించారు. ప్రశాంత మైన జీవనాన్ని కొనసాగించలని అల్లర్లు గొడవలు పాల్పడితే సహించేది లేదని గ్రామాల్లో ఏవైనా అల్లర్లు జరిగితే
మొదటగా మీరే బాధ్యత వహించాలని ఇక మీదట పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.