YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జన సమితి ప్లీనరీని విజయ వంతం చేయాలి

జన సమితి ప్లీనరీని విజయ వంతం చేయాలి

ప్రొ. యం. కోదండరాం నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ జన సమితి పార్టీ స్థాపించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 13న ప్రథమ ప్లీనరీని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కమలాకర్ తెలిపారు.జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం ప్లీనరీ గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా జన సమితి జిల్లా కమిటీ సభ్యుడు ఏల్కా కమలాకర్ మాట్లాడుతూ హైద్రాబాద్ లోని నాగోల్ ఏరియా మమత నగర్ లో గల శుభం కన్వెన్షన్ లో ఈ నెల 13 శనివారం ఉదయం 10 గంటల నుండి ప్లీనరీ సమావేశాలు నిర్వహించ బడుతాయన్నారు.  జనం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, అవినీతి అంతం కోసం పుట్టిన తెలంగాణ జన సమితి పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. ప్రొ. యం. కోదండరాం నాయకత్వంలో జరిగే ఈ జనసమితి పార్టీ ప్రథమ ప్లీనరీకి జిల్లా నలుమూలల నుండి పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మోగిలి సాయి కృష్ణ ,కుమార్, శ్రీనివాస్,అన్వేష్, విగ్నేష్,సాగర్, సాయి, మహిపాల్, వినయ్ ఉన్నారు.

Related Posts