YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి ఆలయంలో ఉదయం 11.00 గంటల నుండి భక్తులకు దర్శనం

శ్రీవారి ఆలయంలో ఉదయం 11.00 గంటల నుండి భక్తులకు దర్శనం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుండి సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. జూలై 17వ తేదీ చంద్రగ్రహణం కారణంగా జూలై 16న రాత్రి 7.00 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాన్ని మూసివేసిన విషయం విదితమే.
బుధవారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

Related Posts