యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుండి సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. జూలై 17వ తేదీ చంద్రగ్రహణం కారణంగా జూలై 16న రాత్రి 7.00 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాన్ని మూసివేసిన విషయం విదితమే.
బుధవారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.