YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బోగీలను వదిలేసిన విశాఖ ఎక్స్ ప్రెస్

 బోగీలను వదిలేసిన విశాఖ  ఎక్స్ ప్రెస్

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

 తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెనుప్రమాదం తప్పింది. విశాఖ వెళ్లాల్సిన ట్రైన్లు తుని రైల్వే స్టేషన్ వద్ద క్రాసింగ్ కావాల్సిఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎక్స్ ప్రెస్ డ్రైవర్ భోగీలను వదిలేసి ముందుకు వెళ్లిపోయాడు. సుమారు పది కిలోమీటర్ల మేర  ఇంజన్  వెళ్లిపోయింది. భోగీలను వదిలేసి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. భయంతో కేకలు వేశారు. మధ్యలో నిలిచిపోవడంతో ఎటువైపు నుంచి ట్రైన్ వస్తుందోనని తెలియక టెన్షన్ పడ్డారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.   భోగీలు వదిలిని విషయాన్ని రైలు అధికారులు డ్రైవర్ వాకీ టాకీద్వారా తెలిపారు. దాంతో  డ్రైవర్ రైలును  వెనక్కి తెచ్చాడు.  దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇంజన్ రాకపోవడంతో తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందారు ప్రయాణికులు. డ్రైవర్ వచ్చి భోగీలకు ఇంజిన్ అమర్చి యదావిధిగా తీసుకెళ్లాడు..రైలు విశాఖ  నుండి  విజయవాడ వైపు వెళ్ళుతుండగా ఈ ఘటన జరిగింది.  తరువాత తుని రైల్వే స్టేషన్  నుండి రైలు బయలుదేరింది. ప్రమాదం కారణంగా విశాఖ  ఎక్స్ ప్రెస్  ఆలస్యంగా  నడిచింది.

Related Posts