YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు చేసిన తప్పుల్నే ఇప్పుడు జగన్ చేస్తున్నారు: కన్నా

చంద్రబాబు చేసిన తప్పుల్నే ఇప్పుడు జగన్ చేస్తున్నారు: కన్నా

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని మొదట్నుంచీ చెబుతున్నామని, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని చెప్పినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు చేసిన తప్పుల్నే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన తప్పును ధైర్యంగా చెప్పలేక.. కేంద్రంపై నెట్టడం సరికాదని హితవు పలికారు. కొత్తూరు తాడేపల్లి గోసంరక్షణ కేంద్రంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో కేంద్రం సూచనలను జగన్‌ పట్టించుకోలేదని, తాజాగా కోర్టు ఆదేశాలతో  ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తేలిపోయిందని కన్నా వ్యాఖ్యానించారు. కనీసం పోలవరం అథారిటీ దృష్టికి కూడా జగన్‌ ఏ విషయాలూ తీసుకెళ్లలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

Related Posts