వర్షపు నీరు ఎక్కడివి అక్కడే నిల్వ ఉండి భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయని కె. వి. కె సైంటిస్ట్ మస్తానయ్య అన్నారు. ఆయన గురువారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో వ్యవసాయ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జల శక్తి అభియాన్ పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్ శక్తి అభియాన్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. నీటి యొక్క ప్రాముఖ్యత, నీటిని ఆదా చేసి ఎలా భావితరాలకు ఉపయోగించాలనే విషయంపై ఆయన వివరించారు. ఇంకుడు గుంతలు, ఫార్మ్ పాండ్స్, ఏటవాలు ప్రాంతాల్లో ఏర్పరిచే కందకాల వలన వర్షపు నీరు అక్కడికక్కడే నిలిచి భూగర్భ జలాలు పెరుగుతాయని ఆయన వివరించారు. అదేవిధంగా మొక్కల ప్రాముఖ్యత వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైంటిస్ట్ విజయ్ కుమార్. ఉద్యానశాఖ అధికారి శ్రీకాంత్. మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్ .సర్పంచ్ శ్రీలత. ఎం పి టి సి బాల్ రెడ్డి. గ్రామ సమన్వయ సమితి కోఆర్డినేటర్ శ్రీధర్ ఏపీవో సత్యనారాయణ. పంచాయతీ సెక్రెటరీ చంద్రశేఖర్. ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు. ఈవో పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.