YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెళ్లి పత్రిక పంపిస్తే..

Highlights

  • శ్రీవారి తలంబ్రాలు
పెళ్లి పత్రిక పంపిస్తే..

నూతన దంపతులకు శ్రీవారి అక్షింతలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చింది. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు అందజేయాలని నిర్ణయించింది. శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తమకు పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తామని తెలిపారు. పెళ్లి పత్రికను ఎగ్జిక్యూటివ్ అధికారి, టీటీడీ, కేటీ రోడ్, తిరుపతి-517 501కు పంపించాలని పేర్కొన్నారు. 

Related Posts