శ్రీ వెంకటేశ్వరుడంటే ఎవరికి మాత్రం భక్తి ఉండదు?. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఇండియాలోనే అత్యంత కుబేరుడిగా పేరున్న ముఖేష్ అంబానీ కూడా అంతే. ఆయన, ఆయన కుటుంబీకులు తరచూ తిరుమల సందర్శించి, స్వామికి కానుకలు సమర్పిస్తూనే ఉంటారు. తాజాగా, ముఖేష్ అంబానీ, స్వామివారికి రూ. 1.11 కోట్లను పంపారు. ఈ మొత్తాన్ని సంస్థ ప్రతినిధి ప్రసాద్, స్వయంగా తిరుమలకు వచ్చి అధికారులకు అందించారు.