YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంకల్పయాత్రలో మరో మైలురాయి

Highlights

  • గత ఏడాది నవంబర్‌ 6న  శ్రీకారం
  • 180 రోజులు 
  •  125 నియోజకవర్గాలు 
  •  3వేల కిలోమీటర్ల మేర 
  • జగన్ సంకల్పయాత్ర 
సంకల్పయాత్రలో మరో మైలురాయి

 గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో వైసీపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జగన్ ములుకుదురులో ఓ మొక్కను నాటారు.   వైఎస్‌ఆర్‌  జిల్లా ఇడుపుల‌పాయ‌లో గత ఏడాది నవంబర్‌ 6న  వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. 180 రోజులపాటు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి కాగా ప్రస్తుతం  గుంటూరు జిల్లాలోని ప్ర‌వేశించింది.
పాదయాత్ర సందర్భంగా జగన్ ఏపీ సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకువెళుతున్నారు.

Related Posts