YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

‘పద్మావత్‌’కు సుప్రీంకోర్టులో ఊరట

‘పద్మావత్‌’కు సుప్రీంకోర్టులో ఊరట

తొలినుంచి వివాదాల్లో నిలుస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘పద్మావత్‌’కి సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో వివాదాలు ఎదుర్కొని ఎట్టకేలకు 25న విడుదలకు నోచుకుంటోంది.

సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ ఇచ్చినప్పటికీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు సినిమా విడుదలపై నిషేధం విధించాయి.

ఈ నేపథ్యంలో బుధవారం ‘పద్మావత్‌’ నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ సినిమా విషయంలో సుప్రీం గురువారం తీర్పునిస్తూ ఐదు రాష్ట్రాల్లో సినిమాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది. దాంతో భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. దీపిక పదుకొణె ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రలో నటించారు. పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, అల్లావుద్ది్‌న్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

Related Posts