YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నారై కార్యకర్తలతో పవన్ భేటీ

Highlights

పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ
వామపక్ష నేతలతో భేటీ కానున్న పవన్ 

ఎన్నారై కార్యకర్తలతో పవన్ భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం జనసేన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం గుంటూరులో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నిప్పిన సంగతి తెలిసిందే. ఆ  సభ అనంతరం అయన వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. ఇందులో భాగంగా సభకు విచ్చేసిన ఎన్నారై వింగ్ తో పవన్  గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో  పార్టీ భవిష్యత్ కార్యాచరణను, పార్టీ నిర్మాణంపై చర్చించినట్టుగా సమాచారం. దాదాపు 40 మంది ఎన్నారై కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుసింది. ఈ భేటీ అనంతరం వామపక్ష నేతలతో ఆయన సమావేశం కానున్నారు. 
 

Related Posts