YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చింతమనేనిని పరామర్శించిన నారా లోకేష్

చింతమనేనిని పరామర్శించిన నారా లోకేష్

చింతమనేనిని పరామర్శించిన నారా లోకేష్
ఏలూరు  
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో  పర్యటించారు. ఏలూరు సబ్ జైలు లో టిడిపి నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పరామర్శించారు. తరువాత అయన మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి చింతమనేని ప్రభాకర్ ని వేధిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు పై చింతమనేని న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో చింతమనేని రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే.తరువాత చింతమనేని కుటుంబ సభ్యులను లోకేష్ కలిసారు.  చింతమనేని పై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు,పోలీసులు వ్యవహరించిన తీరుని చింతమనేని సతీమణి రాధ లోకేష్ కి వివరించారు. వైకాపా వేధింపులకు భయపడకుండా పోరాటం చేస్తున్న కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ లోకేష్ ఇచ్చారు. 

Related Posts