YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ జయభేరి మోగిద్దాం రండి  కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ 

కాంగ్రెస్ జయభేరి మోగిద్దాం రండి  కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ 

కాంగ్రెస్ జయభేరి మోగిద్దాం రండి  కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ 
గురువారం  కాంగ్రెస్ సమయాత్త సమావేశం 
కాంగ్రెస్ నేతలు మల్లురవి, చల్లా వంశీచంద్ రెడ్డిల రాక 
షాద్ నగర్ 
రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పట్టణ కార్యకర్తలు నూతన ఉత్తేజంతో ఎన్నికల్లో పోరాడేందుకు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి మోగించడం ఖాయమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 7వ తేదీ గురువారం నాడు షాద్ నగర్ పట్టణానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవితో పాటు కల్వకుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డిలు కాంగ్రెస్ సమావేశానికి  హాజరవుతారని ఆయన అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల కదనరంగంలోకి దూకాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేసి చిత్తు చేయాలని ఆయన కోరారు. మున్సిపల్ ఎన్నికలు పట్టణానికి ఎంతో ముఖ్యమైన ఎన్నికలని అన్నారు. ఎట్టి పరిస్థితిలో ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన సమయం అన్నారు. ప్రతి కార్యకర్త శాయశక్తులా కృషి చేసేందుకు ముందుకు రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని రేపు షాద్ నగర్ లో ఏర్పాటు చేయనుందని ఈ కార్యక్రమానికి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆయా విభాగాల కార్యకర్తలు నాయకులు బాధ్యులు హాజరు కావాలని కోరారు. స్థానిక సాయిరాజా ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ సమావేశం ఉంటుందని ఆయన వివరించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, బాల్రాజ్ గౌడ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, మధు, సిద్ధార్థ, మాధవ్, మన్నె రవి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts