YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హాస్టళ్ల విద్యార్థులు ఆరుబయిటే నిద్ర

హాస్టళ్ల విద్యార్థులు ఆరుబయిటే నిద్ర

హాస్టళ్ల విద్యార్థులు ఆరుబయిటే నిద్ర
కర్నూలు,
సి హాస్టల్ విద్యార్థులు. హాస్టల్ భవనం శిధిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో కొండపై ఉన్న ఆర్డీవో కార్యాలయం ఎదుట రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు వెళ్లి వారిని వివరాలు అడగ్గా నిత్యం ఎదుర్కొంటున్న హాస్టల్ సమస్యలు ఎకరువుపెట్టారు. హాస్టల్ భవనం కూలేందుకు సిద్ధంగా ఉందని అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని చేసేదిలేక రోడ్డుపై పడుకున్నట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏబివిపి విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ రాజశేఖర్ తన బృందంతోవచ్చి నిద్రపోతున్న హాస్టల్ విద్యార్థులపై ఏబివిపి ప్లెక్సీలను కప్పి చలి నుంచి రక్షణ కల్పించారు. పేద హాస్టల్ విద్యార్థుల పట్ల అధికారుల తీరు, విద్యాశాఖ మొండి వైఖరులను ఈ సందర్భంగా వారు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో హాస్టళ్ల నిర్వహణ తీరుకు బిసి హాస్టల్ ఓ నిదర్శనమన్నారు. హాస్టల్‌ను తరలించి విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి హుటాహుటీన చేరుకున్న ఆర్డీవో ఉమాదేవి హాస్టల్ మార్పుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Posts