YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోదీని విజయసాయిరెడ్డి కలిస్తే తప్పేంటి.

Highlights

  • ప్రధానిని ఎంపీలు కలవడం సహజం 
  • టీడీపీ నేతలతో మాట్లాడేందుకు బీజేపీ సిద్ధం
  • విశాఖ రైల్వే జోన్ వస్తుంది
  • ఏపీ బీజేపీ అధ్యక్షులు హరిబాబు స్పష్టికరణ
మోదీని విజయసాయిరెడ్డి కలిస్తే తప్పేంటి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వైసీపీ ఎంపీ  విజయసాయిరెడ్డి కలిస్తే తప్పేంటని ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేసుల నుంచి బయటపడేసేందుకే  ప్రధాని కార్యాలయంలో విజయసాయిరెడ్డి తిరుగుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎంపీ హరిబాబు మాట్లాడుతూ. ప్రధానిని ఎంపీలు కలవడం సాధారణ విషయమేనని చెప్పారు. టీడీపీ నేతలు ఎలాంటి అపోహలు పెట్టుకోరాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. త్వరలోనే విశాఖ రైల్వే జోన్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

Related Posts