YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

 ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి

Highlights

  • చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు మృతి
  • మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు
 ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి

ఒంటిపూట బడికి పోయి వచ్చిన చిన్నారులు, ఆడుకోవడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శనివారం ఈ విషాద సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొండమల్లెపల్లి మండలం పెండ్లి పాకల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఓంకార్ కుమారులు సంతోశ్(7), రాకేశ్(6) హన్మా కుమారులు - నవదీప్ (7), సాత్విక్(6) సర్ధార్ కుమారుడు - శివ (6) ఉన్నారు. 

Related Posts