జగన్ ది మూడు ముక్కలాట: సీపీఐ నారాయణ
తిరుపతి డిసెంబర్ 23
: జగన్ ది మూడు ముక్కలాటని.. ఆయనది నెగెటివ్ ట్రెండ్ అని..అది రాష్ట్రానికి మంచిది కాదని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. మహారాష్ట్రలో మొదలైన బీజేపీ పతనం జార్ఖండ్లోనూ కొనసాగుతోందన్నారు. సీఏఏ వల్ల దేశానికి ఒరిగేది ఏమీ లేదన్నారు. ఓట్ల కోసం మతం పేరుతో ఈ బిల్లు తెస్తున్నారని నారాయణ విమర్శించారు. బీజేపీ, సంఘ్పరివార్లు బ్రిటీష్ ప్రభుత్వానికి కొమ్ముకాశాయన్నారు. రోహ్యంగాల కంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లే రాక్షసులని నారాయణ విమర్శించారు.