తిరుపతిని రాజధాని చేయాల్సిందే
తిరుపతి డిసెంబర్ 23,
తిరుపతి ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర పాలనలో నియంత పోకడలు కనిపిస్తున్నాయి. అధికారులు, మంత్రులు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. కనీసం సూచన కూడా చేయలేకున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ వ్యాఖ్యానించారు. సోమవారం నాడు అయన మీడియతో మాట్లాడారు. ఇప్పటికి 4 సార్లు మారిన రాజధాని అయిదోసారి మారడం ఖాయం. తిరుపతిని రాజధాని చేయాల్సిందే. 1953లోనే తిరుపతిని రాజధాని చేయాలని నిర్ణయించారు. కర్నూలుకు హైకోర్టు వచ్చే అవకాశం లేదని అయన అన్నారు. రాజకీయ కక్షపూరిత ధోరణిని రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలపై చూపడం సరైంది కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో అమిత్ షా ఇంటి చుట్టూ తిరుగుతోంది. జగన్, చంద్రబాబులు అమిత్ షా జేబులో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికార పార్టీ కొమ్ముకాస్తోందని చింతామోహన్ ఆరోపించారు.