ఉప రాష్ట్రపతి కి ఘన స్వాగతం
విజయవాడ డిసెంబర్ 23
కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో నాలుగు రోజుల పర్యటన సందర్భంగా భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం న్యూ ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నరు. అయనకు గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ప్రోటోకాల్ డైరెక్టర్ కిషోర్ కుమార్, అడిషనల్ డిజి హరీష్ కుమార్ గుప్త, జిల్లా కలెక్టర్ ఏ. ఎండీ. ఇంతియాజ్, పొలిస్ కమీషనర్ ద్వారక తిరుమలరావు,మాజీ మంత్రి డా.కామినేని శ్రీనివాస్, శాసనసభ్యులు వల్లభనేని వంశీ, సబ్ కలెక్టర్ స్వపనిల్ దినకర్ స్వాగతం పలికారు.