ఉపకార వేతనాల కోసం తాసిల్దార్ కార్యాలయం ముట్టడి
ఎమ్మిగనూరు డిసెంబర్ 23
పట్టణంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు మూడేళ్లుగా ఉపకార వేతనాలు మంజూరు చేయాలంటూ వివిధ ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కళాశాలల ప్రతినిధి లింగప్ప మాట్లాడుతూ మూడేళ్ల నుంచి విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఉపకార వేతనాలు లేక చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యకు స్వస్తి పలుకుతున్నారని ఆయన వాపోయారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రతినిధి వేణుగోపాలాచారి, తదితరులు పాల్గొన్నారు.