YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

క్యాబ్ పై ప్రజల నుంచి అబిప్రాయాలు కేంద్ర కేబినెట్ నిర్ణయం

క్యాబ్ పై ప్రజల నుంచి అబిప్రాయాలు కేంద్ర కేబినెట్ నిర్ణయం

క్యాబ్ పై ప్రజల నుంచి అబిప్రాయాలు
కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ, డిసెంబర్ 24, 
దేశంలో తాజాగా తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం హోంమంత్రిత్వశాఖ ప్రత్యేక ఈ మెయిల్‌ను రూపొందించింది. ప్రజలతోపాటు ఎంపీలు, ప్రముఖుల నుంచి ఈ అభిప్రాయాలు సేకరించనున్నారు.‘జాతీయ పౌరసత్వ చట్టాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు..? భారతీయ పౌరులపై ఇది ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారా? సీఏఏపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ బిల్లుతో లక్షిత మూడు దేశాల్లోని (పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్) మైనార్టీలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? సీఏఏపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, హింసాత్మక ఘటనలపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ చట్టం దేశానికి నష్టం కలిగిస్తుందని అనుకుంటున్నారా’’ వంటి రకరకాల ప్రశ్నలు వేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రజలు తమ అభిప్రాయాలను నిర్దేశిత ఈ-మెయిల్‌‌కు పంపాలని కోరింది.మరోవైపు, సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న సంగతి తెలిసిందే. కొందరు బీజేపీ నాయకుల్లోనూ అసహనం ఉన్నా, చాలా మంది బయటపడడం లేదు. అయితే, తొలిసారిగా పశ్చిమ్ బెంగాల్ బీజేపీ నాయకుడి నుంచి నిరసన గళం వినిపించింది. ఈయనెవరో కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు.. బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్. బిల్లుకు మద్దతుగా కోల్‌కతాలో జేపీ నడ్డా ర్యాలీ నిర్వహించిన కొద్ది సేపటికే చంద్రకుమార్ తన నిరసన వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే, బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతే కారణంగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధికారం కోల్పోవడం, గతంలోనూ కొన్ని రాష్ట్రాల్లో నష్టం జరగడం కూడా కొన్ని కారణాలుగా చెబుతున్నారు. సీఏఏపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం మరింత పెరిగితే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని తెలుస్తోంది.

Related Posts