YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రధానికి అమరావతి రైతుల లేఖ

ప్రధానికి అమరావతి రైతుల లేఖ

ప్రధానికి అమరావతి రైతుల లేఖ
విజయవాడ, డిసెంబర్ 24, 
మూడు రాజధానుల నిర్ణయం, జీఎన్ రావు కమిటీ నివేదికపై అమరావతి భగ్గుమంటోంది. వారం రోజులుగా రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. దీక్షలు, ధర్నాలు, రాస్తారోకో, వంటా-వార్పులతో అమరావతి ప్రాంతాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకో రూపంలో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు తమ సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు.అమరావతి రైతులు ప్రధాని మోదీకి లేఖలు రాశారు. రాజధాని విషయంలో అన్యాయం జరిగిందని.. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం, ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. రాజధాని కోసం తాము భూములు ఇచ్చామని.. రాష్ట్రంలో తాజా పరిణామాలను లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు గతంలో ప్రధాని మోదీ చేతులమీదగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం, ప్రధాని స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.అమరావతి రైతులు మూడు పేజీలతో ఈ లేఖల్ని పంపించారు. రైతులు తమ ఆధార్‌ జిరాక్స్‌లను లేఖకు జోడించి ప్రధాని కార్యాలయం అడ్రస్‌కు స్పీడ్‌ పోస్ట్‌‌ ద్వారా లేఖల్ని పంపించారు. పెద్ద సంఖ్యలో లేఖలను రైతులు ప్రధాని కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ చేశారు. మరి ఈ లేఖలపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Related Posts