YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ తండ్రికి నివాళి, భావోద్వేగం

జగన్ తండ్రికి నివాళి, భావోద్వేగం

జగన్ తండ్రికి నివాళి, భావోద్వేగం
కడప, డిసెంబర్ 24,
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఇడుపులపాయ వెళ్లిన సీఎం.. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ ఘాట్‌పై పూల మాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్‌తో పాటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్‌కు నివాళులు అర్పించారు.అంతకముందు వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి బయల్దేరి రాయచోటి వెళ్లి.. అక్కడ పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.ఇటు ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, సహనం, త్యాగం, క్షమాగుణం క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయన్నారు ముఖ్యమంత్రి

Related Posts