YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా రైతు పక్షపాతి

వైకాపా రైతు పక్షపాతి

వైకాపా రైతు పక్షపాతి
తాడేపల్లి  డిసెంబర్ 26   
గురువారం జరిగిన వంగవీటి మోహన రంగా వర్దంతి కార్యక్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణ రెడ్డి పాల్గోన్నారు. రంగా విగ్రహనికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. తాను కనపడటంలేదని రైతులు చేసిన ఫిర్యాదుపై స్పందించారు. మా అన్నయ్య కుమారుడి వివాహ కార్యక్రమం ఉన్నందునే నేను మంగళగిరిలో లేను. నాలుగు రోజుల ఊరులో లేకపోతే రాజకీయాలు చేయడం తగదని అన్నారు. తాను రైతుల పక్షాన నిలిచి వ్యక్తిని. గతంలో అనేక పోరాటాలు చేసిన విషయం గుర్తు ఉంచుకోవాలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా కచ్చితంగా నిలిచి ఉంటుంది. గత 40 సంవత్సరాల నుంచి కుప్పంలో చంద్రబాబు కనపడటంలేదని అక్కడి ప్రజలు ఆయనపై ఫిర్యాదు చేశారు ముందు దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. 

Related Posts