రాజధానిపై జగన్ పునరాలోచించాలి: ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు డిసెంబర్ 26
: రాజధానిపై జగన్ పునరాలోచించాలని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం మానుకోవాలన్నారు. రేపు రాష్ట్రానికి జగన్ గ్రహణం పట్టకుండా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జగన్ అనాలోచిత ప్రకటనకు ప్రజలు రోడ్లపైకి వచ్చి.. ఆందోళనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. జగన్ ప్రకటన ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసేలా ఉందన్నారు. కోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వానికి సిగ్గురావడం లేదన్నారు. కేబినెట్లో అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం ఉంటే.. ఈ నెల 28న రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.