YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

అయ్యప్ప స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

అయ్యప్ప స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

అయ్యప్ప స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు
ఎమ్మిగనూరు జనవరి 4  
పట్టణంలోని హెచ్.పి పెట్రోల్ బంక్ వెనుక ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి అధ్యక్షులు జె.మల్లిగురుస్వామి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీకమాసం ప్రారంభము నుండి ఇప్పటి వరకు హుండీ ఆదాయం  రూ.38620/- వచ్చినట్లు మల్లి గురుస్వామి తెలిపారు.ఈ కార్యక్రమానికి గురుస్వాములు బంగారు ఈరన్న స్వామి,జయలక్ష్మి శివ శంకర్ స్వామి, శివ స్వామి (ఫోటోగ్రఫీ),లోకేష్ స్వామి, శ్రీనివాసులు స్వామి,రంగారెడ్డి స్వామి మరియు మాల వేసిన అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Related Posts