అంగరంగ వైభవంగా కర్ని గ్రామంలో శివస్వాముల ఆధ్వర్యంలో శివలింగ పున: ప్రతిష్టాపన
మక్తల్, ఫిబ్రవరి 14,
నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని, కర్ని గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర వున్న శివాలయం యందు తేదీ: .14 ఫిబ్రవరి 2020 వ తెల్లవారుజామున 5:30 నిమిషాలకు సుప్రభాతం, శివలింగం పార్వతీదేవి , గణపతి, నంది,కుమారస్వామి నాగదేవతల విగ్రహాలకు ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 8:00 గంటలకు గో పూజ, 09:00 ప్రతిష్ట దేవతల అర్చన పూజలు, అంకురార్పణ. 11: 00 నూతన మూర్తుల జలాభిషేకం. 01: 00 పీట దేవతల పూజ. 01:25 నైవేద్యం , మంగళ హారతి , తీర్థ ప్రసాదా వితరణ కార్యక్రమాలు జరిగాయి.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పంచమ సిద్ధలింగ మహస్వామి నెరడగం వారు హాజరయ్యారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్, చిట్యాల నిజం పాషా, గ్రామం సర్పంచ్ చిన్న బలరాం, ఎంపీటీసీ రంగప్ప, బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య, జగదీష్ కుమార్, నాగప్ప గ్రామస్థులు, భక్తులు చుట్టు ప్రక్కల ఉన్న శివస్వాములు అధిక సంఖ్యలో పాల్గొని కర్ని గ్రామాన్ని శివనామ స్మరణతో మార్మోగిపోయింది.