వైకాపావి కక్ష సాధింపు చర్యలు
అనంతపురం ఫిబ్రవరి 24
వైసీపీ నేతలు మితిమీరిన జోక్యం చేసుకుంటూ.. టీడీపీ నేతలను దెబ్బ తీస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారన్న కోపంతోనే అచ్చెన్నాయుడిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం 7కోట్ల ఫైల్పై సంతకం చేస్తే... భారీ స్కాం చేసినట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల ఎంపిక రాజకీయ కక్ష సాధింపుగా మారిందన్నారు.బీసీ నేత అయిన అచ్చెన్నాయుడిని రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. చాలా ఏళ్ల నుంచి హక్కుదారులుగా ఉన్న టీడీపీ నేతలు, సానుభూతిపరుల భూములు తీసుకుంటున్నారన్నారు. ఇళ్ల స్థలాల ఎంపిక పూర్తిగా రాజకీయ కోణంలో నడుస్తోందన్నారు.టీడీపీ నేతల టార్గెట్గా సాగుతున్న ఈ భూసేకరణను ఆపాలన్నారు. ప్రజలపై ప్రేమ ఉంటే ప్రైవేటు స్థలాలు కొని పంచాలని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.