పాలమూరులో కేటీఆర్ పాదయాత్ర..
మహబూబ్నగర్ ఫిబ్రవరి 24
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి పర్యటించారు. పట్టణంలోని పాత తోట రోడ్డులో కేటీఆర్ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఓ ఇంటి ముందు అరుగుపై కూర్చున్న వృద్ధులతో కేటీఆర్ ముచ్చటించారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని వృద్దులను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. స్థానికంగా ఉన్న సమస్యలపై కేటీఆర్ ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మితో పాటు ఇతర పథకాలు అందుకుంటున్నామని వృద్ధులు.. కేటీఆర్కు చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ను, ప్రభుత్వాసుపత్రి సమీపంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ను, ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మించిన బీటీ రోడ్డు మరియు సెంట్రల్ మీడియన్, రైల్వేస్టేషన్ నుంచి డీఈవో ఆఫీసు వరకు నూతనంగా నిర్మించిన రోడ్డును కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ కలిసి ప్రారంభించారు.