దిశా పోలీసు స్టేషన్ ప్రారంభించిన సీఎం జగన్
విజయనగరం ఫిబ్రవరి 24
విజయనగరంలోని దిశా పోలీస్ స్టేషన్ ని సిఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ... గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల పేరుని, గ్రామ మహిళా సంరక్షణ పోలీసులుగా మార్పు చేస్తూ జగన్ ప్రకటించారు. ప్రతి 2 వేల జనాభాకి ఒక సంరక్షణ పోలీస్ ని నియమిస్తామన్నారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అని ప్రతి గ్రామంలో ఒక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా గ్రామాన్ని దాటకుండానే సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలోనే అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని సిఎం జగన్ పేర్కొన్నారు.