YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రత్యేక హోదాపై మరింత జోరు పెంచిన పవన్

Highlights

  •  రెండు రోజులపాటు విజయవాడలో పర్యటన 
  • 4న వామపక్షాలతో కార్యాచరణ 
  • 5న ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణ
ప్రత్యేక హోదాపై మరింత జోరు పెంచిన పవన్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరుబాటపట్టిన  జనసేనాని పవన్ కల్యాణ్ మరింత జోరు  పెంచనున్నారు. ఇందుకు వామపక్షాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. ఈ క్రమంలో జనసేనాని కూడా మరింత బలోపేతం చేసేందుకు ద్రుష్టి సారించారు. తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలకు మాత్రమే పరిమితమైన ప్రెసిడెంట్ కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనితో పాటుగా ఈ నెల 4 ,5 తేదీల్లో విజయవాడలో ఆయన పర్యటించనున్న పవన్ పార్టీ కమిటీల నిర్మాణం చెప్పాట్టనున్నారు . అంటే కాకుండా బుధవారం  వామపక్షాలతో కలిసి హోదా పోరు ప్రణాళికపై సమావేశం కానున్నారు. గురువారం  ఏపీ మాజీ సీఎస్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని పవన్ ఆవిష్కరించనున్నట్టు సమాచారం.

Related Posts