నాలుగు నెలలుగా నా అధికారాలను హరించివేసారు అడుగడుగునా అవమానిస్తున్నారు.
‘‘నాపై కక్ష కట్టారు ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీలో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ గవర్నర్కు మూడు పేజీల లేఖను అందజేశారు.. అడుగడుగునా అవమానిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన ఏపీపీఎస్సీలో నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు నడుస్తున్నాయు. చైర్మన్ ఆధ్వర్యంలో కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ సెక్రెటరీ ద్వారానే జరుగుతున్నాయి. ఫైళ్లపై మెంబర్లు గుడ్డిగా సంతకాలు పెడుతున్నారు. ఈ పరిణామం నన్ను తీవ్రంగా కలిచి వేస్తోంది. ఇప్పటి వరకు ఓర్చుకున్నాను. సహించాను’’ కొద్ది రోజులపాటు కనీసం చాంబర్కు వచ్చి కూర్చోలేని పరిస్థితులు కూడా కల్పించారని తెలిపారు. చైర్మన్ ఉండగానే ఎలాంటి సమాచారం, కారణం లేకుండానే మెంబర్ రంగరాజన్ను ఇన్చార్జి చైర్మన్గా నియమించారని, వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇన్చార్జి చైర్మన్ను నియమించే అధికారం గవర్నర్కు మాత్రమే ఉంటుందని వివరించారు.