వైసీపీది అరాచక ప్రభుత్వం
విజయవాడ, మార్చి 21
వైసీపీది అరాచక ప్రభుత్వం. ఎన్నికల కమిషనర్ కే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. కేంద్ర బలగాల సాయంతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు శూన్యమని అయన విమర్శించారు. ప్రజల ప్రాణాలకంటే జగన్ కు ఎన్నికలే ముఖ్యం. ఏపీలో కరోనా బాధితులు పెరుగుతున్నారని అయన అన్నారు.